UN Security Council: భారత్పై పాక్ ఆరోపణలు.. పాక్నే ప్రశ్నించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి

అయితే, ఈ విషయంపై సమావేశమైన UNSC పాకిస్తాన్ వాదనలను తోసిపుచ్చింది. అంతేకాకుండా.. ఉగ్రవాదం, ఇతర ఆందోళనకర అంశాలపై పాకిస్తాన్నే సూటిగా ప్రశ్నించింది.
మండలి సభ్యులు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మత విశ్వాసాల ఆధారంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సైతం వారు తప్పుబట్టారు. ఉగ్రవాద చర్యలను ఏ రూపంలోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు. ఈ దాడులకు బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ చేపడుతున్న క్షిపణి పరీక్షలు మరియు అణ్వాయుధాలను ఉపయోగిస్తామనే తరహా రెచ్చగొట్టే ప్రకటనలపై UNSC సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ప్రాంతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని వారు అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పాకిస్తాన్కు సూచించారు.
India-Pakistan Crisis: ఇప్పటివరకు పాకిస్తాన్పై భారత్ తీసుకున్న చర్యలు ఇవే..
టెర్రర్ అటాక్, మతాన్ని బట్టి టూరిస్టులను టార్గెట్ చేయడాన్ని ఖండించింది. క్షిపణి ప్రయోగాలు, న్యూక్లియర్ దాడులు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టింది.
సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్తో ద్వైపాక్షిక చర్చలు జరపడమే సరైన మార్గమని UNSC పాకిస్తాన్కు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేయడం కాకుండా, నేరుగా చర్చల ద్వారా సయోధ్య కుదుర్చుకోవాలని సూచించింది.
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందం నిలిపివేత.. భారత్ చర్యను తిరస్కరించిన పాకిస్తాన్