Skip to main content

Modi-Vance Talks: భార‌త్‌, అమెరికా మ‌ద్య దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం

అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
PM Modi, US VP Vance discuss trade, strategic ties and global issues

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్ 21న వాన్స్‌ కుటుంబంతో కలిసి 7 లోక్‌కల్యాణ్ మార్గ్ కు వచ్చారు. ఆయన సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఈవాన్, వివేక్, మీరాబెల్ కూడా వెంట ఉన్నారు. మోదీ స్వయంగా కారు వరకు వచ్చి వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసి, సాదర స్వాగతం పలికారు.

ఒప్పందం పురోగతిపై సంతృప్తి
మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. 

దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం 
ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక భారత్‌ ఒక ప్రకటన విడుదలచేసింది. ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్‌ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

UNSC: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం

నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌కు, ఇటు వికసిత్‌ భారత్‌ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. 

టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. 

12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్‌ ఢిల్లీకి వచ్చారు. 

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 22 Apr 2025 12:47PM

Photo Stories