India Pakistan War: పాక్కు చెందిన మూడు ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్

ఏరివేతే తమ లక్ష్యమని భారత్ చెప్పినా వినకుండా నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. మే 8వ తేదీ పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇది పాకిస్తాన్ నేరుగా దాడికి పాల్పడినట్లు రుజువు చేస్తోంది.
భారతీయ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా స్పందించి పాకిస్తాన్ యొక్క డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. దీనిలో S-400 సుదర్శన చక్ర, ఎల్-70, సూ-23, షిల్కా వంటి వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయి.
లాహోర్, సర్గోధా, ఫైసలాబాద్ నగరాల్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను భారత డ్రోన్లు ధ్వంసం చేశాయి. ఒక పాక్ ఫైటర్ పైలట్ను రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత సైన్యం పట్టుకుంది. దాదాపు 30 డ్రోన్లు, ఒక ఎఫ్-16 ఫైటర్ జెట్, రెండు జేఎఫ్-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది.
S-400 Missile System: భారత వాయుసేనలో.. పవర్ఫుల్ ఆయుధం ఇదే..
F-16 కూల్చివేత: భారతీయ SAM (ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి) రక్షణ వ్యవస్థ పాకిస్థాన్ యొక్క అత్యాధునిక F-16 సుపర్సోనిక్ యుద్ధ విమానాన్ని కూల్చివేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అది కూడా పాకిస్థాన్ భూభాగంలోనే, అత్యంత భద్రత కలిగిన సర్ఘోదా వైమానిక స్థావరం సమీపంలో జరగడం గమనార్హం.
1971 తర్వాత ఇదే తొలిసారి: రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, 1971 యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఇంత పెద్ద స్థాయిలో ఉద్రిక్తతలు తలెత్తడం ఇదే మొదటిసారి. ఇది పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తోంది.
India Military Operations: పాక్పై భారత్ చేపట్టిన ప్రధాన ఆపరేషన్లు ఇవే..