Skip to main content

Operation Sindoor: భారత్‌, పాక్‌ యుద్ధం.. దేశంలో 32 విమానాశ్రయాలు మూసివేత

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం వేళ భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది.
32 airports in India to be closed till May 15   AAI announcement on flight suspension   List of 32 airports with suspended operations

తాజాగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలోని 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు విమానాశ్రయాల వివరాలను వెల్లడించింది.
 
వివరాల ప్రకారం.. ఉత్తర , పశ్చిమ భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో విమాన కార్యక్రమాలు నిలిపిపోయాయి. 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు  AAI తెలిపింది. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

Holidays Suspended: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సెలవులు నిలిపివేత.. 

ఈ నెల 15 వరకు ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి ఎలాంటి విమానాల రాకపోకలు ఉండవని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం.. మే 8వ తేదీ తొలుత 24 విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 32 విమానాశ్రయాల్లో కార్యక్రమాలను నిలిపివేశారు.

విమానాశ్రయాలు ఇవే..
అమృత్‌సర్, చండీగఢ్, జైసల్మేర్, జమ్మూ, పటియాలా, పోర్‌బందర్, పఠాన్‌కోట్, అవంతిపూర్, బటిండా, భుజ్, బికానెర్, హల్వారా, అధమ్‌పూర్, అంబాలా, హిండన్, జామ్‌నగర్, జోధ్‌పూర్, కండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోద్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లుధియానా, ముంద్రా, నలియా, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, షిమ్లా, శ్రీనగర్, థోయిస్, ఉత్తర్‌లై.

India Attacks Pakistan: పాకిస్తాన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన ప్రాంతాలు ఇవే..

Published date : 10 May 2025 03:04PM

Photo Stories