Skip to main content

Pakistani Ships: పాక్ ఓడలపై నిషేధం విధించిన భారత్

పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
India Bans Pakistani Ships From Entering Indian Ports

పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో, మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 

పాకిస్తాన్ విమానాలకు భారత్‌ ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్‌ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్‌ కొనసాగిస్తోంది. 

Indus Water Treaty: సింధు జలాల ఒప్పందం నిలిపివేత‌.. భారత్ చర్యను తిరస్కరించిన పాకిస్తాన్

Published date : 03 May 2025 07:21PM

Photo Stories