Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో కూడా..

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం ఈరోజు (ఏప్రిల్ 19వ తేదీ) మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ మరియు ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం అఫ్ఘానిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో 130 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ స్థాయిలో భూమి కంపించడం గత మూడు రోజుల్లో ఇది రెండవసారి. ఈ భూకంపం సరిహద్దు ప్రాంతంలో సంభవించడం వల్ల పాకిస్తాన్పై కూడా ప్రభావం చూపింది.
Forest Area: దేశంలో 13,056 చదరపు కిలోమీటర్ల అటవీ భూముల ఆక్రమణ..!
అలాగే, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా తేలికపాటి భూప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. ఉపరితలం నుండి 130 కిలోమీటర్ల లోతులో టెక్టానిక్ ప్లేట్స్లో పెద్ద కదలికలు చోటు చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. రాజధాని కాబుల్కు ఈశాన్య దిశగా ఉన్న బదాక్షన్ ప్రావిన్స్ పరిధిలోని మాఘ్ నువుల్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.
Greenland: గ్రీన్లాండ్లో.. 5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది