Bhagavad Gita: భగవద్గీతకు యునెస్కో ప్రతిష్టాత్మక గుర్తింపు!

భగవద్గీత అంటే ఏంటి?
భగవద్గీత అంటే భగవంతుని సందేశం. ఇది మహాభారతంలోని ఒక భాగం (భీష్మ పర్వం) కాగా, శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మ, కర్తవ్య, ఆత్మజ్ఞానంపై ఇచ్చిన బోధనల సమాహారం. మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో ముద్రింబడిన ఈ గ్రంథం జీవిత విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
యునెస్కో గుర్తింపు ప్రాముఖ్యత
యునెస్కో ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహిత్య, కళా, సాంస్కృతిక సంపదలను Intangible Cultural Heritage గా గుర్తిస్తూ జాబితా ప్రకటిస్తుంది. ఈసారి భగవద్గీతను కూడా ఆ జాబితాలో చేర్చడం భారత సాంస్కృతిక ఘనతకు ప్రతీక.

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
భగవద్గీత ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా 75కంటే ఎక్కువ భాషల్లో దీనికి అనువాదాలు ఉన్నాయ్. శాంతి, ధర్మం, కర్మ, భక్తి వంటి తత్వాల్ని బోధించే గీతా సందేశం విశ్వమానవత్వానికి మార్గనిర్దేశం చేస్తోంది.
ప్రభుత్వ స్పందన
భారత ప్రభుత్వం ఈ గుర్తింపును భారత ప్రజల అభిమానం మరియు పూర్వీకుల జ్ఞానానికి గౌరవంగా అభివర్ణించింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖులు, సంస్కృత నిపుణులు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు.
![]() ![]() |
![]() ![]() |