Skip to main content

Bhagavad Gita: భ‌గ‌వ‌ద్గీత‌కు యునెస్కో ప్ర‌తిష్టాత్మ‌క గుర్తింపు!

న్యూఢిల్లీ: భారత ఋషుల జ్ఞాన సంపదకు ప్రపంచం మరోసారి తలవంచింది. భ‌గ‌వ‌ద్గీత — హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పవిత్ర గ్రంథానికి, తాజాగా యునెస్కో (UNESCO) నుండి ప్రపంచ వారసత్వ విలువైన సాహిత్యంగా గుర్తింపు లభించింది. ఇది భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక మహిమాన్ను ప్రతిబింబించే గొప్ప గౌరవం.
bhagavad gita unesco intangible heritage india

భగవద్గీత అంటే ఏంటి?

భగవద్గీత అంటే భగవంతుని సందేశం. ఇది మహాభారతంలోని ఒక భాగం (భీష్మ పర్వం) కాగా, శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మ, కర్తవ్య, ఆత్మజ్ఞానంపై ఇచ్చిన బోధనల సమాహారం. మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో ముద్రింబడిన ఈ గ్రంథం జీవిత విధానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.

యునెస్కో గుర్తింపు ప్రాముఖ్యత

యునెస్కో ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహిత్య, కళా, సాంస్కృతిక సంపదలను Intangible Cultural Heritage గా గుర్తిస్తూ జాబితా ప్రకటిస్తుంది. ఈసారి భగవద్గీతను కూడా ఆ జాబితాలో చేర్చడం భారత సాంస్కృతిక ఘనతకు ప్రతీక.

bhagavad gita unesco intangible heritage india

చదవండి: Phule Couple for Bhart Ratna : ఫూలే దంపతుల గొప్ప క‌థ‌.. భార‌తర‌త‌న్న ఇవ్వాల‌ని తీర్మానం.. మొద‌టి మ‌హిళ‌గా..!

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ

భగవద్గీత ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా 75కంటే ఎక్కువ భాషల్లో దీనికి అనువాదాలు ఉన్నాయ్. శాంతి, ధర్మం, కర్మ, భక్తి వంటి తత్వాల్ని బోధించే గీతా సందేశం విశ్వమానవత్వానికి మార్గనిర్దేశం చేస్తోంది.

ప్రభుత్వ స్పందన

భారత ప్రభుత్వం ఈ గుర్తింపును భారత ప్రజల అభిమానం మరియు పూర్వీకుల జ్ఞానానికి గౌరవంగా అభివర్ణించింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రముఖులు, సంస్కృత నిపుణులు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు దీనిపై ఆనందం వ్యక్తం చేశారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Apr 2025 03:27PM

Photo Stories