Skip to main content

IMD 150 Years: భారత వాతావరణ విభాగానికి 150 ఏళ్లు పూర్తి

భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనవరి 15వ తేదీకి 150 వసంతాలు పూర్తి చేసుకుంది.
150 Years of India Meteorological Department

ఈ విభాగం చిన్న స్థాయిలో వర్షమానిని (రెయిన్‌గేజీ) స్థాపించి ప్రారంభమైనప్పటికీ, ఇప్పటి వరకు వాతావరణ సమాచార రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది.

భారత వాతావరణ విభాగం ఆవిర్భావానికి కారణమైన కీలక సంఘటనలు బ్రిటిష్‌ కాలంలో చోటు చేసుకున్నాయి. 1864లో ఒక భయంకరమైన తుపాను, 1866, 1871 సంవత్సరాల్లో రుతుపవనాల వైఫల్యం కారణంగా ఏర్పడిన తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ స్థాపనకు దారితీశాయి.

1875 జనవరి 15న, అవిభక్త భారతదేశంలో (పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌) వాతావరణ విభాగం 77 వర్షమానినిలను (రెయిన్‌గేజీలు) మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది. ఈ వర్షమానిన్ల నుంచి సేకరించిన సమాచారంతో.. బ్రిటిష్‌ అధికారి హెచ్.ఎఫ్.బ్లాన్‌ఫోర్డ్ తొలిసారిగా భారతదేశం వర్షపాత పటాన్ని రూపొందించి పెద్ద ప్రతిష్టను పొందాడు. ఆయన భారత ప్రభుత్వానికి వాతావరణ పరిస్థితులను వివరించే మొత్తమొదటి వాతావరణ సమాచార అధికారి (రిపోర్టర్‌)గా పని చేశారు.

History of Kumbh Mela: 144 ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప వేడుక.. మహా కుంభమేళా ఎలా మొదలైంది?

ఈ సందర్భంగా ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర వాతావరణ శాఖ పురాణాన్ని, దాని చరిత్రను వివరిస్తూ.. విభాగం చేసిన మహత్తర సర్వీస్‌ గురించి వెల్లడించారు.

Published date : 16 Jan 2025 03:53PM

Photo Stories