Skip to main content

Japanese Companies: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం

హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది.
Telangana signs pacts with companies for eco-town in Hyderabad

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ బృందం ఏప్రిల్ 20వ తేదీ జపాన్‌లోని కిటాక్యూషు నగరాన్ని సందర్శించి., అక్కడి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ విధానాలను అధ్యయనం చేసింది.

ఈ పర్యటనలో భాగంగా, హైదరాబాద్‌లో ఎకో టౌన్‌ను అభివృద్ధి చేయడానికి జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్‌ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కానున్నాయి. 

ఈ సంస్థలు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ మరియు రీసైక్లింగ్ రంగాలలో తమ విశేష అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించనున్నాయి. ఈ మేరకు ఇరుపక్షాలు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ ఓఐ)పై సంతకాలు చేశాయి. 

Telangana Rice: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి

Published date : 21 Apr 2025 03:57PM

Photo Stories