Japanese Companies: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం
Sakshi Education
హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ బృందం ఏప్రిల్ 20వ తేదీ జపాన్లోని కిటాక్యూషు నగరాన్ని సందర్శించి., అక్కడి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ విధానాలను అధ్యయనం చేసింది.
ఈ పర్యటనలో భాగంగా, హైదరాబాద్లో ఎకో టౌన్ను అభివృద్ధి చేయడానికి జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములు కానున్నాయి.
ఈ సంస్థలు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ మరియు రీసైక్లింగ్ రంగాలలో తమ విశేష అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించనున్నాయి. ఈ మేరకు ఇరుపక్షాలు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ ఓఐ)పై సంతకాలు చేశాయి.
Published date : 21 Apr 2025 03:57PM