Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లు.. ప్రతి సోమవారం అకౌంట్లోకి డబ్బులు

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయని ఆయన తెలిపారు.
భూభారతి చట్టం ప్రజలకు చాలా ముఖ్యమైనదని, దాని అమలు బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి పైలట్ మండలాల్లో భూభారతిపై రెవెన్యూ సదస్సులు పూర్తవుతాయని, ప్రస్తుతం 159 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తయ్యాయని ఆయన తెలియజేశారు. పైలట్ మండలాల్లోని రెవెన్యూ సదస్సుల్లో సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచించారు.
Japanese Companies: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరయ్యే బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇంటి నిర్మాణ విషయంలో 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా జరిగితేనే బిల్లులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. మే మొదటి వారంలోగా ప్రతి నియోజకవర్గానికి 3,500 మందికి లబ్ధి అందేలా ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని, అర్హులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా మంత్రి తెలిపారు.
Food Safety Labs: ఏపీలో రెండు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు.. ఈ పట్టణాల్లోనే..