Skip to main content

దేశంలో పెరిగిన నకిలీ నోట్లు, ఆర్‌బీఐ నివేదిక

RBI report: counterfeit notes of all denominations increased in 2021–22
RBI report: counterfeit notes of all denominations increased in 2021–22

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం–2021–22లో అన్ని డినామినేషన్ల నకిలీ నోట్లు పెరిగాయి. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2,000 ఫేక్‌ నోట్లు 54.16 శాతం పెరిగాయి. రూ.50, రూ.100 నోట్లు తప్ప మిగిలిన అన్ని నోట్ల నకిలీ అధికమైందని నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు నగదు చలామణి కూడా గత మూడేళ్లలో 28.28 శాతం పెరిగింది. అన్ని డినామినేషన్లు కలిపి 2020లో రూ.24,20,975 కోట్ల విలువైన బ్యాంకు నోట్లు చలామణిలో ఉండగా, 2021 నాటికి ఈ విలువ రూ.28,26,863 కోట్లకు, 2022 నాటికి రూ.31,05,721 కోట్లకు చేరింది. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్ల వాటా 1.6 శాతానికే పరిమితమైంది. 2016లో కేంద్ర ప్రభుత్వం అప్పటి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 

FDIs: 2021–22లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రికార్డు

Published date : 07 Jun 2022 05:58PM

Photo Stories