Skip to main content

RBI: ఆర్బీఐ కీలక సూచన.. ఇక ఏటీఎంలో రూ.100, రూ.200 నోట్లు మాత్ర‌తే..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
RBI ask Banks to Ensure ATMs Dispense Rs 100, Rs 200 Notes

ఇకపై ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల లభ్యతను పెంచడం. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ ఆదేశాలను దశలవారీగా అమలు చేయాల్సి ఉంటుంది. 
 
ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో, అలాగే 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో కనీసం ఒక్క క్యాసెట్ ద్వారా అయినా రూ.100 లేదా రూ.200 నోట్ల ఉపసంహరణ సదుపాయం ఉండాలి. 

ఈ చర్యతో చిన్న మొత్తాల్లో నగదు అవసరమయ్యే ప్రజలకు, ముఖ్యంగా రోజువారీ ఖర్చుల కోసం ఏటీఎంలను ఉపయోగించే వారికి మరింత సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చాలా ఏటీఎంలలో పెద్ద నోట్లు మాత్రమే ఉండటం వల్ల ప్రజలు చిల్లర కోసం ఇబ్బంది పడుతున్నారు. ఆర్‌బీఐ యొక్క ఈ నిర్ణయం ఆ సమస్యను కొంతవరకు పరిష్కరిస్తుందని ఆశించవచ్చు.

RBI's Gold Rush: ఆర్బీఐ వద్ద ఉన్న బంగారు విలువ‌.. రూ.6.83 లక్షల కోట్లు

Published date : 29 Apr 2025 11:27AM

Photo Stories