Skip to main content

Bank Merger: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 1 నుంచి ఈ 4 బ్యాంకులు విలీనం

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
Bank Merger: These 15 banks will be merged from May 1

నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 'ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ' అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి, ఒక్కో రాష్ట్రంలో ఒకే గ్రామీణ బ్యాంక్‌గా మార్చనున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో ఉన్న 43 ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి చేర‌నుంది.  
 
దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 4, ఉత్తర్‌ప్రదేశ్ 3, పశ్చిమ బెంగాల్ 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో ఒక్కో రాష్ట్రంలో 2 RRBలు ఏకీకరణ కానున్నాయి. 

World Bank: భారత్‌లో జనాభా కంటే ఉద్యోగ అవకాశాలే ఎక్కువ..!

ఏపీలో ఈ 4 బ్యాంకులు విలీనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు — ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ (APGB), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ (CGGB), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (SGB) విలీనం అయి "ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్"గా మారనున్నాయి. కొత్త బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది. 

కస్టమర్ల అకౌంట్ నంబర్‌లు, IFSC కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. పాత చెక్‌బుక్, పాస్‌బుక్‌, ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించాలని వారు సూచించారు.

RBI: ఇక మైనర్లు కూడా బ్యాంక్‌ ఖాతాలు నిర్వహించుకోవచ్చు

Published date : 30 Apr 2025 07:14PM

Photo Stories