యాంటీబాడీల తయారీకి భారత్ బయోటెక్ సిద్ధం
Sakshi Education
కోవిడ్–19 కారక వైరస్ నియంత్రణకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

కరోనా వైరస్ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. న్యూమిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్ కార్యక్రమం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కోవిడ్–19 రోగుల నుంచి సేకరించిన యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఇండోర్లోని ఐఐటీతోపాటు గురుగావ్లోని ప్రెడోమిక్స్ టెక్నాలజీస్లు కూడా ఈ ప్రాజెక్టుకు తమవంతు సాయం అందిస్తాయి. ఇప్పటికే వైరస్ బారిన పడ్డవారికి చికిత్స కల్పించేందుకు యాంటీబాడీలు ఉపయోగపడతాయని, భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి సిద్ధం
ఎప్పుడు : మే 8
ఎవరు : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), భారత్ బయోటెక్
ఎందుకు : కోవిడ్–19 కారక వైరస్ నియంత్రణకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్ను మట్టుబెట్టగల యాంటీబాడీల తయారీకి సిద్ధం
ఎప్పుడు : మే 8
ఎవరు : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), భారత్ బయోటెక్
ఎందుకు : కోవిడ్–19 కారక వైరస్ నియంత్రణకు
Published date : 09 May 2020 07:19PM