వన్డే వరల్డ్ కప్-2019 ప్రారంభం
Sakshi Education
ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్-2019 మే 30న ప్రారంభంకానుంది.

ఇంగ్లండ్లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 45 లీగ్ మ్యాచ్లతో పాటు రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. జూలై 14న ఇంగ్లడ్లోని లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరుగనుంది.
వన్డే వరల్డ్ కప్-2019ను 1992 టోర్నీ తరహాలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు బరిలో నిలవగా, వీటిని ఎలాంటి గ్రూప్లుగా విభజించలేదు. ప్రతీ జట్టు ఇతర తొమ్మిది టీమ్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ టోర్నిలో భారత్తోపాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు పాల్గొంటున్నాయి. భారత జట్టుకు విరాట్ కోహ్లీ నేతృత్వం వహించనున్నాడు.
ప్రారంభ వేడుకలు..
వన్డే వరల్డ్ కప్కు ఐదోసారి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్లో మే 29న ప్రారంభ వేడుకలు నిర్వహించారు. బకింగ్హామ్ ప్యాలెస్ నేపథ్యంగా ‘ది మాల్’ రోడ్లో నిర్వహించిన ఈ వేడుకలకు ఆండ్రూ ఫ్లింటాఫ్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రారంభ వేడుకల సందర్భంగా 2015 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ట్రోఫీని తీసుకొని వచ్చి వేదికపై ఉంచాడు. మరోవైపు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు బొమ్మను లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించారు. టోర్నీ సాగినన్ని రోజులు ఈ విగ్రహం టుస్సాడ్ మ్యూజియంలో ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్డే వరల్డ్ కప్-2019 ప్రారంభం
ఎప్పుడు : మే 30
ఎక్కడ : ఓవల్ మైదానం, ఇంగ్లండ్
వన్డే వరల్డ్ కప్-2019ను 1992 టోర్నీ తరహాలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు బరిలో నిలవగా, వీటిని ఎలాంటి గ్రూప్లుగా విభజించలేదు. ప్రతీ జట్టు ఇతర తొమ్మిది టీమ్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ టోర్నిలో భారత్తోపాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు పాల్గొంటున్నాయి. భారత జట్టుకు విరాట్ కోహ్లీ నేతృత్వం వహించనున్నాడు.
ప్రారంభ వేడుకలు..
వన్డే వరల్డ్ కప్కు ఐదోసారి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లండ్లో మే 29న ప్రారంభ వేడుకలు నిర్వహించారు. బకింగ్హామ్ ప్యాలెస్ నేపథ్యంగా ‘ది మాల్’ రోడ్లో నిర్వహించిన ఈ వేడుకలకు ఆండ్రూ ఫ్లింటాఫ్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రారంభ వేడుకల సందర్భంగా 2015 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ట్రోఫీని తీసుకొని వచ్చి వేదికపై ఉంచాడు. మరోవైపు మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైనపు బొమ్మను లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించారు. టోర్నీ సాగినన్ని రోజులు ఈ విగ్రహం టుస్సాడ్ మ్యూజియంలో ఉంటుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్డే వరల్డ్ కప్-2019 ప్రారంభం
ఎప్పుడు : మే 30
ఎక్కడ : ఓవల్ మైదానం, ఇంగ్లండ్
Published date : 30 May 2019 05:50PM