Skip to main content

విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ తో రిలయన్స్‌ జియో జట్టు

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ గ్రూప్‌ డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ తో జట్టు కట్టింది.
Current Affairs

జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ విలువ రూ. 11,367 కోట్లు. దీంతో మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించినట్లయింది. ఈ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఫేస్‌బుక్‌ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ఇప్పటికే రూ. 43,574 కోట్లతో 9.99 శాతం, మరో టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సిల్వర్‌ లేక్‌ రూ. 5,666 కోట్లతో 1.15 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్‌ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది.

మూడు డీల్స్‌లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్

‌: రూ. 60,596 కోట్లు

ఫేస్‌బుక్‌ పెట్టుబడి (9.99 శాతం వాటా)

: రూ. 43,574 కోట్లు

విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌ (2.32 శాతంవాటా)

: రూ. 11,367కోట్లు

సిల్వర్‌ లేక్‌ పెట్టుబడి (1.15 శాతం వాటా)

: రూ. 5,666 కోట్లు

జియో ఎంటర్‌ప్రైజ్‌ విలువ

: రూ. 5.16 లక్షల కోట్లు


విస్టా సహ వ్యవస్థాపకుడు మనోడే..

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం విస్టా ప్రధానంగా సాఫ్ట్‌వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. దాదాపు 57 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం విస్టా పోర్ట్‌ఫోలియోలో భారత కంపెనీల్లో సుమారు 13,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్‌ సేథ్‌కి భారతీయ మూలాలు ఉన్నాయి. ముకేశ్‌ అంబానీలాగే ఆయన తండ్రి కూడా గుజరాత్‌కు చెందినవారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు కొనుగోలు
ఎప్పుడు : మే 8
ఎవరు : విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌
Published date : 09 May 2020 07:16PM

Photo Stories