Skip to main content

విశాఖ ఘ‌ట‌న మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
Current Affairs

ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని ఆయన మే 7న పరామర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంత‌రం ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈ ఘ‌ట‌న కార‌ణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్థికసాయం అందచేస్తాం. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారందరికీ రూ.10 లక్షలు, బాధిత గ్రామాల్లోని 15 వేలమందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు అంద‌జేస్తాం. జంతు నష్టం జరిగిన వారిని ఆదుకుంటాం. రెండు మూడు రోజులు వైద్యం అవసరమైన వారికి రూ.లక్ష, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, ఒక్కో జంతువుకు రూ.25 వేల నష్టపరిహారం అందిస్తాం. ఎల్జీ కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాం అని ప్రక‌టించారు.


విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7న‌ వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకైంది. స్థానికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. లీకైన స్టైరీన్ మోనోమర్‌ గ్యాస్ కార‌ణంగా అందరికీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. విషవాయువు పీల్చి మే 7నాటికి 10 మంది మృతి చెంద‌గా... 348 మంతి ఆస్పత్రి పాల‌య్యారు.

నైవేలీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం

తమిళనాడులోని ప్రఖ్యాత నైవేలీ లిగ్నైట్ కొర్పొరేషన్(ఎన్ఎల్‌సీ) ప్లాంటులో భారీ ప్రమాదం సంభవించింది. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్‌ ప్లాంట్‌ రెండో యూనిట్‌లో మే 7న ఒక బాయిలర్‌ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లో విష వాయువు లీకేజీ

లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉన్న కాగితం తయారీ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించే క్రమంలో విషవాయువు లీక్‌ అయి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లా టెట్లా గ్రామానికి సమీపంలోని శక్తి పేపర్‌ మిల్‌లో ఈ ఘటన జరిగింది.
Published date : 08 May 2020 07:41PM

Photo Stories