Skip to main content

విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటైంది. www.apsermc.ap.gov.in అనే ఐడీతో రూపొందించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 27న ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
Current Affairs
తమ విద్యా సంస్థల్లోని వసతులు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్లు, కాలేజీలు స్వయంగా ఆ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చేస్తాయని, ఆ డొమెయిన్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. వెబ్‌సైట్‌లో పేర్కొన్న వసతులు, ప్రమాణాలు నిజంగా క్షేత్రస్థాయిలో లేకపోతే ఎవరైనా స్పందించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు.


విద్యారంగంపై మేధోమథన సదస్సు

‘మన పాలన-మీ సూచన’లో భాగంగా మే 27న మూడోరోజు విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మేధోమథన సదస్సు నిర్వహించారు. విద్యారంగ నిపుణులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు, లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలని, మనం పిల్లలకు ఇవ్వగలిగే వెలకట్టలేని ఆస్తి చదువు మాత్రమేనని అన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: www.apsermc.ap.gov.in పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ ఆవిష్కరణ
ఎప్పుడు: మే 27
ఎవరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ: సీఎం క్యాంపు కార్యాలయం, గుంటూరు జిల్లా
ఎందుకు: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం
Published date : 28 May 2020 05:51PM

Photo Stories