Skip to main content

థాయ్‌లాండ్ రాజుగా వజిరలాంగ్‌కార్న్

థాయ్‌లాండ్ రాజుగా మహా వజిరలాంగ్‌కోర్న్ మే 4న అధికారికంగా పట్టాభిషిక్తులయ్యారు.
2016లో ఆయన తండ్రి భూమిబోల్ అదుల్యదేజ్ మరణించడంతో వజిరలాంగ్‌కోర్న్‌కు సదరు బాధ్యతలు సంక్రమించినప్పటికీ సంతాపకాలం పూర్తయ్యేదాకా పట్టాభిషేకాన్ని వాయిదా వేశారు. హిందూ, బౌద్ధ సంప్రదాయానుసారం... జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో వజిలాంగ్‌కోర్న్‌కు 7.3 కిలోల బరువున్న స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు. పట్టాభిషేకానికి నాలుగు రోజులు ముందు తన వ్యక్తిగత భద్రతాదళ డిప్యుటీ చీఫ్ సుథిద తిడ్జాయ్‌ను వాజిరలోంకోర్న్ వివాహం చేసుకున్నారు. క్వీన్ సుథిద పేరుతో ఆమెకు రాణిగా అధికారిక గుర్తింపు ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్ రాజుగా పట్టాభిషేకం
ఎప్పుడు : మే 4
ఎవరు : మహా వజిరలాంగ్‌కోర్న్
Published date : 08 May 2019 05:59PM

Photo Stories