Skip to main content

థామస్‌ జెఫర్సన్ వర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం

కొవిడ్‌- 19 వ్యాధికి టీకా అభివృద్ధి చేసేందుకు యూఎస్‌ఏలోని ఫిల‌డెల్ఫియాలో ఉన్న థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది.
Current Affairs
క్రియార‌హిత రెబీస్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయ‌నున్నట్లు భారత్‌ బయోటెక్‌ సీఈవో డాక్టర్‌ కృష్ణమోహన్ మే 20న తెలిపారు. తాజా ఒప్పందం ప్రకారం టీకాను అభివృద్ధి చేయటమే కాకుండా యూఎస్‌, ఐరోపా, జపాన్‌ తదితర దేశాల్లో విక్రయించే హక్కులు లభిస్తాయి. ప్రస్తుతం కరోనా టీకా అభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాల్లో 25 శాతం ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకా ప్లాట్‌ఫామ్‌లను కేరియర్‌ లేదా వెక్టార్‌గా ఉపయోగించుకుంటున్నవి. దీనివల్ల త్వరితంగా టీకాను అభివృద్ధి చేయటానికి, మెరుగైన ఫలితాలు సాధించటానికి వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : థామస్‌ జెఫర్సన్‌ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : మే 20
ఎవరు : భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్
ఎందుకు : కొవిడ్‌- 19 వ్యాధికి టీకా అభివృద్ధి చేసేందుకు
Published date : 21 May 2020 05:23PM

Photo Stories