Skip to main content

టీవీ 9 కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ 9 తెలుగు ఛానల్ కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావు నియమిస్తూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు మే 10న నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం టీవీ 9 కన్నడ హెడ్‌గా పనిచేస్తున్న మిశ్రా టీవీ 9 తెలుగుకు శాశ్వత సీఈఓను నియమించేంత వరకు పదవిలో ఉండనున్నారు. 2018 ఆగస్టులో ఏబీసీపీఎల్‌లో అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్స్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 90.54 శాతం వాటాను కొనుగోలు చేయగా, రవిప్రకాశ్, ఇతరులకు 9.5 శాతం వాటా ఉంది.

టీవీ 9 తెలుగు ప్రస్తుత హోల్ టైం డెరైక్టర్ అండ్ సీఈఓ నుంచి రవిప్రకాశ్‌ను, హోల్ టైం డెరైక్టర్ అండ్ సీఎఫ్‌వో పదవుల నుంచి మంగిపూడి కల్యాణ వెంకట నరసింహ మూర్తి (ఎంకేవీఎన్ మూర్తి)లను తొలగించారు.టీవీ 9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, యూఎస్‌ఏ, భారత్‌వర్ష్ చానల్స్, న్యూస్ 9 బెంగళూరు, టీవీ 1 హైదరాబాద్ చానల్స్ కూడా ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
టీవీ 9 తెలుగు ఛానల్ కొత్త సీఈఓ నియామకం
ఎప్పుడు : మే 11
ఎవరు : మహేంద్ర మిశ్రా
Published date : 11 May 2019 06:33PM

Photo Stories