టీకా అభివృద్ధిపై ప్రధాని మోదీ సమీక్ష
Sakshi Education
దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ పరిశోధన, పరీక్షల విషయంలో జరుగుతున్న పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 5న సమీక్ష జరిపారు.
శ్రామిక్ స్పెషల్ రైళ్ళకు మార్గదర్శకాలు
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళను కేంద్రం నడుపుతోంది. శ్రామిక్ స్పెషల్ రైళ్ళలో ప్రయాణికుల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలని, ఇబ్బందులు, గొడవలు లాంటి సమస్యలు ఉత్పన్నం అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జోనల్ రైల్వేలకు భారతీయ రైల్వే శాఖ మే 5న మార్గదర్శకాలు విడుదల చేసింది.
సుప్రీంకోర్టులో రెంట్ పిటిషన్ తిరస్కరణ
ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్ను లాయర్ పవన్ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ పరిశోధన, పరీక్షల విషయంలో జరుగుతున్న పురోగతిపై సమీక్ష
ఎప్పుడు : మే 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

విద్యావేత్తలు, ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థల నిపుణులతో వ్యాక్సిన్ అభివృద్దిపై ఏర్పాటైన టాస్క్ఫోర్స్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘సంక్షోభ సమయాల్లో సుసాధ్యమైన విషయాలే రోజువారీ జీవనంలోనూ భాగంగా మారాలి’అని ఆయన అన్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రామిక్ స్పెషల్ రైళ్ళకు మార్గదర్శకాలు
దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు శ్రామిక్ స్పెషల్ రైళ్ళను కేంద్రం నడుపుతోంది. శ్రామిక్ స్పెషల్ రైళ్ళలో ప్రయాణికుల ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచాలని, ఇబ్బందులు, గొడవలు లాంటి సమస్యలు ఉత్పన్నం అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జోనల్ రైల్వేలకు భారతీయ రైల్వే శాఖ మే 5న మార్గదర్శకాలు విడుదల చేసింది.
సుప్రీంకోర్టులో రెంట్ పిటిషన్ తిరస్కరణ
ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్ను లాయర్ పవన్ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఔషధ పరిశోధన, పరీక్షల విషయంలో జరుగుతున్న పురోగతిపై సమీక్ష
ఎప్పుడు : మే 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 06 May 2020 08:45PM