Skip to main content

తెలంగాణ విద్యార్థిని అంజలికి ఇన్ఫోసిస్ అవార్డు

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు’ లభించింది.
Current Affairsఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వార్షిక సమావేశం సందర్భంగా జనవరి 4న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అంజలికి ఇజ్రాయెల్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు ఈ అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డును అందజేస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇన్ఫోసిస్ ఫౌండేషన్-ఇస్కా ట్రావెల్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ విద్యార్థిని దారావత్ అంజలి
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక

మాదిరి ప్రశ్నలు
Published date : 06 Jan 2020 06:07PM

Photo Stories