Skip to main content

తెలంగాణ సీఎస్‌కు నెల్సన్ మండేలా అవార్డు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యలు ‘నెల్సన్ మండేలా అవార్డు-2020’కు ఎంపికయ్యారు.
Edu newsఈ విషయాన్ని ముద్ర సొసైటీ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు మే 25న తెలిపారు. నేషనల్ కో.ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా- న్యూఢిల్లీ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో -ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్తంగా ‘నెల్సన్ మండేలా అవార్డును ఇస్తున్నారుు. 2020, నవంబర్ 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో సోమేశ్‌కుమార్, జస్టిస్ చంద్రయ్యలకు ఈ ప్రదానం చేయనున్నారు.
 
 2001 -03 సంవత్సరాల మధ్య అనంతపురం జిల్లా కలెక్టర్‌గా సోమేశ్‌కుమార్ పనిచేసినప్పుడు ఆ జిల్లాలో నెలకొన్న భయంకర కరువు పరిస్థితుల్లో ఆకలిబాధను తీర్చడానికి పనికి ఆహారం పథకం కింద వచ్చిన కేంద్ర ప్రభుత్వ కరువు బియ్యం పేదలకు చేర్చడానికి కృషి చేశారని రామదాసప్ప ప్రశంసించారు. అలాగే జస్టిస్ జి.చంద్రయ్య ప్రజల వద్దకే న్యాయమంటూ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచుతున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
నెల్సన్ మండేలా అవార్డు-2020కు ఎంపిక
 ఎప్పుడు  : మే 25
 ఎవరు  : తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, రాష్ట్ర హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
Published date : 26 May 2020 06:14PM

Photo Stories