సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ సమీక్ష
Sakshi Education
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం కావడం, టిబెట్లో వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్ చిత్రాలు బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 26న ఉన్నతస్థారుు సమావేశం జరిపారు.
దీంతోపాటు లదాఖ్లో నెలకొన్న పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స స్టాఫ్ జనరల్ రావత్, త్రివిధ దళాధిపతులతోపాటు విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లాతోనూ చర్చించారు.
ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు
భారత్, చైనా సరిహద్దుల్లో 3,500 కిలో మీటర్ల ప్రాంతంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల్ని ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై సమీక్ష
ఎప్పుడు : మే 26
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు
భారత్, చైనా సరిహద్దుల్లో 3,500 కిలో మీటర్ల ప్రాంతంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల్ని ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై సమీక్ష
ఎప్పుడు : మే 26
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Published date : 27 May 2020 05:45PM