Skip to main content

సరిహద్దుల్లో చైనా మిలటరీ హెలికాప్టర్లు

భారత్, చైనాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
Current Affairs

తూర్పు లడాఖ్‌ ప్రాంతంలో చైనాకు చెందిన మిలటరీ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం, సరిహద్దులు గుర్తించని ప్రాంతాలకు అతి దగ్గరగా ఎగరడం ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో భారత సుఖోయ్‌–30 రకం విమానాలు అక్కడ చక్కర్లు కొట్టాయి. ఇటీవ‌లే పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్, చైనా దేశాలకు చెందిన సుమారు 250 మంది సైనికుల మధ్య ఘర్షణలు జ‌రిగిన విష‌యం తెలిసిందే.


రక్తసిక్తమైన అఫ్గాన్‌

అఫ్గానిస్తాన్‌లో మే 12న‌ కాబూల్‌ సహా మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో 36 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. కాబూల్‌లోని దస్తీబర్చీలో ఓ ప్రసూతి ఆస్పత్రిలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు.

వూహాన్‌లో అందరికీ పరీక్షలు

చైనాలోని వూహాన్‌లో నెల రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నగరంలో నివసిస్తున్న ప్రజలందరికీ కరోనానిర్ధారణ పరీక్షలు చేయనుంది. 1.1కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చైనా అధికారిక మీడియా తెలిపింది.
Published date : 13 May 2020 08:37PM

Photo Stories