సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్-డ్రోన్
Sakshi Education
సరిహద్దుల్లో భారత్తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది.
పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్-డ్రోన్ను త్వరలోనే టిబెట్లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుంది. ఈ విషయాన్ని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్-డ్రోన్ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరిహద్దుల్లో హెలికాప్టర్-డ్రోన్
ఎప్పుడు : మే 25
ఎవరు : చైనా
ఎక్కడ : టిబెట్లో భారత్ సరిహద్దుల్లో

గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్-డ్రోన్ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరిహద్దుల్లో హెలికాప్టర్-డ్రోన్
ఎప్పుడు : మే 25
ఎవరు : చైనా
ఎక్కడ : టిబెట్లో భారత్ సరిహద్దుల్లో
Published date : 26 May 2020 06:26PM