Skip to main content

సీఎస్‌ఆర్ పరిధిలోకి పీఎం కేర్స్‌కు విరాళాలు

పీఎం కేర్స్ నిధికి కంపెనీలు అందించే విరాళాలను కూడా ప్రభుత్వం ఇకపై కార్పొరేట్ సామాజిక కార్యకలాపాల (సీఎస్‌ఆర్) కింద పరిగణించనుంది.
Current Affairs
ఈ మేరకు ఇందుకు సంబంధించి కంపెనీల చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేసింది. కంపెనీల చట్టం 2013 కింద లాభదాయక కంపెనీలు గడిచిన మూడేళ్ల సగటు నికర లాభాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం రెండు శాతాన్ని సీఎస్‌ఆర్ కార్యకలాపాలకు వెచ్చించాల్సి ఉంటుంది.

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పీఎం-కేర్స్ ఫండ్‌కి ఇచ్చే వ్యయాలను కూడా సీఎస్‌ఆర్ కింద పరిగణిస్తామంటూ కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ 2020, మార్చిలో ప్రకటించింది. దానికి అనుగుణంగానే సంబంధిత చట్టానికి సవరణ చేసింది. మార్చి 28 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లవుతుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: సీఎస్‌ఆర్ పరిధిలోకి పీఎం కేర్స్‌కు విరాళాలు
ఎప్పుడు: మే 27
ఎవరు: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ
Published date : 28 May 2020 05:39PM

Photo Stories