Skip to main content

రిలయన్స్‌, అల్లానలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.
Current Affairs
ఆగస్టు 20న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రిలయన్స్‌ రిటైల్, జియో, అల్లాన కంపెనీల ప్రతినిధులు, సెర్ప్‌ సీఈఓ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌తోఅవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పుడు రిలయన్స్, అల్లానా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయి. తద్వారా మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది మా ప్రయత్నం’’ అని పేర్కొన్నారు.

రిలయన్స్‌ రిటైల్‌...
  • మహిళల కిరాణా వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తుంది.
  • దుకాణాల నిర్వహణ, ఆధునికీకరణ, వ్యాపార సమర్థతను పెంచడంలో మహిళలకు శిక్షణ ఇస్తుంది.
  • సరసమైన ధరలకే ఉత్పత్తులను అందిస్తుంది. పండ్లు, కూరగాయల సాగుకు సహకరిస్తుంది.

జియో...
 
  • ఈ కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానించే ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తుంది.
  • ప్రభుత్వం, లబ్ధిదారులైన మహిళల మధ్య నేరుగా అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది.
  • జియో చాట్‌ ద్వారా నేరుగా 20 లక్షల మంది లబ్ధిదారులతో ఆడియో, వీడియో సందేశాలు పంపడం, ఇతరత్రా అదనపు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తుంది.

అల్లాన...
 
  • ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎగుమతి రంగంలో విశేష అనుభవం ఉంది. 1865 నుంచి కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
  • గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో సాంకేతిక సహకారం అందిస్తుంది. వాటిని తిరిగి కొనుగోలు చేయనుంది.

చదవండి:

ఐఎస్‌బీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

మూడు ప్రముఖ‌ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

క్విక్ రివ్యూ :
ఏమిటి : రిలయన్స్‌ రిటైల్, జియో, అల్లాన కంపెనీలతో ఎంఓయూ
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు :మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా
Published date : 25 Aug 2020 05:04PM

Photo Stories