రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే
Sakshi Education
రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఇస్తూ చైన్నైలోని ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్) సదరన్ బెంచ్ మే 20న ఉత్తర్వులు జారీ చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుతోపాటు హైదరాబాద్కు తాగునీటి సమస్య తలెత్తుతుందంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్పల్లికి చెందిన గవినోల్ల శ్రీనివాస్ చెన్నైలోని ఎన్జీటీ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారించింది. పర్యావరణ, హైడ్రలాజికల్ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని పిటిషనర్ వాదించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, హైడ్రలాజికల్ క్లియరెన్స్ అవసరమా? లేదా? అన్న అంశంపై అధ్యయనం చేయడానికి జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఎన్జీటీ ఆదేశించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే
ఎప్పుడు : మే 20
ఎవరు : చైన్నైలోని ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్) సదరన్ బెంచ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే
ఎప్పుడు : మే 20
ఎవరు : చైన్నైలోని ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్) సదరన్ బెంచ్
Published date : 21 May 2020 05:18PM