రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా
Sakshi Education
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందజేసింది.

17వ లోక్సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు మే 25న కోవింద్ను కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా అందజేత
ఎప్పుడు : మే 25
ఎవరు : ఎన్నికల కమిషన్ (ఈసీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా అందజేత
ఎప్పుడు : మే 25
ఎవరు : ఎన్నికల కమిషన్ (ఈసీ)
Published date : 27 May 2019 05:44PM