Skip to main content

రాష్ట్రపతి వేతనంలో ఏడాదిపాటు 30 శాతం కోత

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి తనవంతు సాయం అందించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందుకొచ్చారు.
Current Affairs

తన వేతనంలో ఏడాది పాటు 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఖర్చులకు కళ్లెం వేయడానికి పలు దేశీయ యాత్రలు, ఇతర కార్యక్రమాలను రాష్ట్రపతి గణనీయంగా తగ్గించుకోనున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్‌ హోమ్, స్టేట్‌ బాంక్వెట్స్‌ వంటి కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించనున్నారు. వడ్డించే ఆహార పదార్థాల సంఖ్యను కుదిస్తారు. సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలకు ఉపయోగించే లిమోసిన్‌ కారు(ధర రూ.10 కోట్లు) కొనుగోలుకు ఈ ఏడాది దూరంగా ఉండాలని రాష్ట్రపతి నిర్ణయించారు.


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తాజా నిర్ణయాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్‌ బడ్జెట్‌ 20 శాతం తగ్గుతుందని అంచనా. రాష్ట్రపతి భవన్‌కు కేంద్ర బడ్జెట్‌కు ప్రతిఏటా రూ.200 కోట్లకుపైగా కేటాయిస్తారు. ఈ ఏడాది ఇందులో రూ.40–45 కోట్లు మిగలనున్నాయి. పీఏం–కేర్స్‌ ఫండ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ 2020, మార్చి నెలలో తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వేతనంలో ఏడాదిపాటు 30 శాతం కోత
ఎప్పుడు : మే 14
ఎందుకు : కరోనా వైరస్‌పై పోరాటానికి తనవంతు సాయం అందించడానికి
Published date : 15 May 2020 06:45PM

Photo Stories