రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతికి కరోనా
Sakshi Education
రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్(80)కు కరోనా సోకింది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా, కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆగస్టు 5న అయోధ్యలో నిర్వహించిన రామమందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మహంత్ వేదికను పంచుకున్నారు. ఇదే వేదికపై యూపీ సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఉన్నారు. రామ మందిర ట్రస్ట్తో పాటు శ్రీకృష్ణ జన్మభూమి న్యాస్కు సైతం నృత్యగోపాల్ దాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
చదవండి:
మందిర నిర్మాణం-1528 నుంచి 2019 తీర్పు వరకు
చదవండి:
మందిర నిర్మాణం-1528 నుంచి 2019 తీర్పు వరకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా బారిన పడ్డ రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతి
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు :మహంత్ నృత్య గోపాల్ దాస్
ఏమిటి : కరోనా బారిన పడ్డ రామ జన్మభూమి ట్రస్ట్ అధిపతి
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు :మహంత్ నృత్య గోపాల్ దాస్
Published date : 14 Aug 2020 05:20PM