రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల
Sakshi Education
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి తెలిపారు.
అందులో భాగంగానే శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్కు నివేదించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. రాజీవ్గాంధీ హత్య కేసులో దోషుల విడుదల నిర్ణయం గవర్నర్కు ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని తమిళ సంఘాలు దోషుల విడుదలకు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి ఘటనలో నష్టపోయిన బాధితుల కుటుంబాలు మాత్రం దీనికి అడ్డుపడుతున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల కు కట్టుబడి ఉన్నాం
ఎప్పుడు : మే 20
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల కు కట్టుబడి ఉన్నాం
ఎప్పుడు : మే 20
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి
Published date : 21 May 2019 05:48PM