Skip to main content

ప్రముఖ కన్నడ సాహితీవేత్త నిస్సార్ క‌న్నుమూత‌

ప్రముఖ కన్నడ సాహితీవేత్త, నిత్యోత్సవ కవిగా పేరొందిన కె.ఎస్ నిస్సార్ అహ్మద్‌ (84) కన్నుమూశారు.
Current Affairsవయోభారంతోపాటు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని నివాసంలో మే 3న తుదిశ్వాస విడిచారు. అధ్యాపకుడిగా వృత్తిని ఆరంభించిన నిస్సార్‌ 1978లో ‘నిత్యోత్సవ’ పేరిట తొలి పాటల క్యాసెట్‌ను విడుద‌ల చేశారు. సాహిత్యం ద్వారా ప‌లు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. కర్ణాటక సాహిత్య అకాడమీ, కెంపేగౌడ పురస్కారం, రాజ్యోత్సవ పురస్కారం, అరసు వంటి పురస్కారాలు పొందారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన నిసార్‌ అహ్మద్‌ 73వ కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడిగా వ్యవహరించారు.
Published date : 04 May 2020 07:46PM

Photo Stories