Skip to main content

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జ‌గ‌న్ లేఖ‌

కోవిడ్‌–19 నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కేంద్రం ఆదుకుంటే తప్ప పరిశ్రమలు తిరిగి పుంజుకునే అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
Current Affairs

జాతీయ తయారీ రంగం ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలకు గణనీయమైన భాగస్వామ్యం ఉందని, రాష్ట్రంలో పరిశ్రమల రంగం నిలదొక్కుకోవడానికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ఏప్రిల్ 30న ఆయన లేఖ రాశారు. ఏ రంగాల్లో సహకారం కోరుతున్నది లేఖలో వివరించారు.


దారిద్య్రంలోకి పది కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా మురికి వాడల్లో నివసిస్తోన్న ప్రజల్లో దాదాపు పది కోట్ల మంది ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా దారిద్య్రంలో మగ్గిపోతారని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే రక్షిత మంచినీరు, సరైన మురికి పారుదల వ్యవస్థ లేకుండా అనారోగ్యానికి గురవుతున్న వారి పరిస్థితి మరింత దుర్భరం అవుతుందని ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ సమేహ్‌ వాహ్‌బా తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల మురికి వాడల నుంచి వచ్చే పన్ను వసూళ్లు కూడా 15 నుంచి 25 శాతానికి పడి పోతాయి కనుక ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం పట్టణ కార్పొరేషన్లకు ఉండే అవకాశం కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ‌
ఎప్పుడు : ఏప్రిల్ 30
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : కోవిడ్‌–19 నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల రంగ ప‌రిస్థితిని వివ‌రించేందుకు

Published date : 01 May 2020 07:58PM

Photo Stories