Skip to main content

పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఆనంద్‌

పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్ (పరిపాలనాధికారి)గా ఒ.ఆనంద్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది.
Current Affairsఈయన ప్రస్తుతం పోలవరం స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉండగా ఆ పదవిని రద్దు చేసి తాజా బాధ్యతలు అప్పగించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మే 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లించడం, పునరావాస కాలనీల నిర్మాణం, కాలనీలకు నిర్వాసితులను తరలించడం తదితర పనులు చేస్తున్న వివిధ విభాగాలను సమన్వయం చేయడం, ఉత్పన్నమయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి ప్రక్రియను ఆన్ంద్ పూర్తి చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్‌ భూసేకరణ విభాగాలు, సహాయ పునరావాస విభాగాలు, పునరావాస కాలనీల పనులు చేస్తున్న వివిధ ఇంజనీరింగ్‌ విభాగాలు అడ్మినిస్ట్రేటర్‌ పరిధిలోనే పనిచేస్తాయి. మ‌రోవైపు స్పెషల్‌ కలెక్టర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న ఇ.మురళిని సాధారణ పరిపాలన విభాగానికి ప్రభుత్వం బదిలీ చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా నియామ‌కం
ఎప్పుడు : మే 10
ఎవరు : ఒ.ఆనంద్‌
Published date : 11 May 2020 06:15PM

Photo Stories