Skip to main content

ప్లాస్మా ట్రయల్స్‌పై 21 సంస్థలకు అనుమతి

కోవిడ్‌ నుంచి కాపాడేందుకు ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌కి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) దేశంలోని 21 సంస్థలకు అనుమతినిచ్చింది.
Current Affairs

థెరపీ ద్వారా కోవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని యాంటీబాడీస్‌ని సేకరించి, వాటిని కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల కోవిడ్‌ని ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు 111 సంస్థలు ఆసక్తి చూపగా, 21 సంస్థలకే అనుమతి లభించింది. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన వాటిలో తెలంగాణలోని గాంధీ మెడికల్‌ కాలేజీ ఉంది.


ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) మే 6న నోటి ఫికేషన్‌ జారీ చేశారు. ఈ తరహా శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా, భారత్‌లోనే విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్లాస్మా ట్రయల్స్‌పై 21 సంస్థలకు అనుమతి
ఎప్పుడు : మే 6
ఎవరు : ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)
ఎందుకు : కోవిడ్‌ నుంచి కాపాడేందుకు
Published date : 07 May 2020 07:28PM

Photo Stories