పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై కేబినెట్ కమిటీలు
Sakshi Education
విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు దేశచరిత్రలోనే తొలిసారిగా రెండు కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ రెండు కమిటీలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వహించనున్నారు. పెటుబడులు, అభివృద్ధి కేబినెట్ కమిటీ కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్గోయల్లను సభ్యులుగా ఉన్నారు. భారత్లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆర్థికవ్యవస్థ వృద్ధిపై కమిటీ దృష్టి సారించనుంది.
అదే విధంగా ఉద్యోగకల్పన-నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్దీప్ పురీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు యువత ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై కేబినెట్ కమిటీలు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు
అదే విధంగా ఉద్యోగకల్పన-నైపుణ్యాభివృద్ధిపై ఏర్పాటైన కేబినెట్ కమిటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, సీతారామన్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్, రమేశ్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్, ఎంఎన్ పాండే, సంతోష్ కుమార్ గంగ్వార్, హర్దీప్ పురీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టితో పాటు యువత ఉపాధి పొందేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడంపై దృష్టి పెట్టనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెట్టుబడులు, ఉద్యోగ సృష్టిపై కేబినెట్ కమిటీలు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు
Published date : 06 Jun 2019 05:41PM