పారిస్ ఫోరంలో ఐఎంఎఫ్ అధ్యక్షురాలు
Sakshi Education
అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య పరమైన సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే ఆందోళన వ్యక్తంచేశారు.

పారిస్లో నిర్వహించిన పారిస్ ఫోరం కార్యక్రమానికి హాజరైన ఆమె ఓ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి అమెరికాకు వస్తున్న దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం సుంకాన్ని ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేసిందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా, చైనా మధ్య విభేదాలు ప్రపంచ వృద్ధికి ముప్పు
ఎప్పుడు : మే 7
ఎవరు : ఐఎంఎఫ్ అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా, చైనా మధ్య విభేదాలు ప్రపంచ వృద్ధికి ముప్పు
ఎప్పుడు : మే 7
ఎవరు : ఐఎంఎఫ్ అధ్యక్షురాలు క్రిస్టిన్ లాగార్డే
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 08 May 2019 06:03PM