Skip to main content

పాకిస్థాన్‌కు ఆసియాకప్ ఆతిథ్య హక్కులు

2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకుంది.
ఈ మేరకు మే 29న సింగపూర్‌లో జరిగిన ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) సమావేశంలో నిర్ణయించారు. అయితే 2009లో పాక్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరగడంతో చాలా దేశాలు ఆ దేశంలో పర్యటనకు వెనకంజ వేస్తున్నాయి. పాక్‌తో సరైన సంబంధాలు లేనందున భారత్ సైతం దాయాది దేశంలో ఆడకపోవచ్చు. వాస్తవానికి ఇదే కారణంగానే 2018 ఏడాది భారత్‌లో జరగాల్సిన ఈ టోర్నీని తటస్థ వేదిక అయిన యూఏఈలో నిర్వహించారు. దీంతో ఈ సారి కూడా తటస్థ వేదికలో టోర్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి.

టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఆసియా కప్ 2020 ఏడాది సెప్టెంబర్‌లో జరుగనుంది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు ఏసీసీ నిర్ణయించింన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు
ఎప్పుడు : మే 29
ఎవరు : పాకిస్థాన్
Published date : 30 May 2019 05:48PM

Photo Stories