Skip to main content

పాకిస్తాన్‌లోని భారత ఎంబసీపై డ్రోన్‌ చక్కర్లు

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంపై జూన్‌ 26న ఒక డ్రోన్‌ చక్కర్లు కొట్టినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరింధమ్‌ బాగ్చీ తెలిపారు.
Current Affairs
ఈ ఘటనపై విచారణ జరపాలని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. భారత ఎంబసీపై డ్రోన్‌ చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలను పాకిస్తాన్‌ తోసిపుచ్చింది. అది భారత్‌ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది.

మరోవైపు జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై జూన్‌ 27న జరిగిన డ్రోన్‌ దాడి ఉగ్రవాదుల దుశ్చర్యేనని భానత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ భదౌరియా జూలై 2న పేర్కొన్నారు.
Published date : 03 Jul 2021 06:05PM

Photo Stories