Skip to main content

పాక్ మాజీ క్రికెటర్ ఉమర్‌కు కరోనా

పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. మే 23న అస్వస్థతకు గురి ఉండటంతో ఉమర్ కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాడు.
Current Affairsపరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చిందని... అయితే తనలో కరోనా లక్షణాలు తీవ్రంగా ఏమీ లేవని... ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వివరించాడు. 38 ఏళ్ల ఉమర్ పాకిస్తాన్ తరఫున 44 టెస్టులు ఆడి 2,963 పరుగులు... 12 వన్డేలు ఆడి 504 పరుగులు సాధించాడు. కోవిడ్-19 బారిన పడ్డ నాలుగో క్రికెటర్ ఉమర్. గతంలో మాజిద్ హక్ (స్కాట్లాండ్), జఫర్ సర్ఫరాజ్ (పాకిస్తాన్), సోలో ఎన్‌క్వెని (దక్షిణాఫ్రికా)లకు కరోనా సోకింది.

కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్
2020, ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ భవిష్యత్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాక... కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: కరోనా బారినపడ్డ పాక్ మాజీ క్రికెటర్
ఎప్పుడు : మే 23
ఎవరు : తౌఫిక్ ఉమర్
Published date : 25 May 2020 06:17PM

Photo Stories