Skip to main content

ఒడిశాకు వెయ్యి కోట్లు సాయం

ఫొని తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఒడిశాలోని ‘ఫొని’ తుపాను బాధిత ప్రాంతాలను మే 6న ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన 34 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు సాయంగా అందిస్తామన్నారు. ఏటా ప్రకృతి విపత్తులు సర్వసాధారణంగా మారిన ఒడిశా, మిగతా తీరప్రాంత రాష్ట్రాల కోసం దీర్ఘకాలిక పరిష్కారం రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిశాకు రూ.381 కోట్లను సాయంగా అందజేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఒడిశాకు వెయ్యి కోట్లు సాయం
ఎప్పుడు : మే 6
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : ఫొని తుపాను కారణంగా నష్టపోయినందుకు
Published date : 07 May 2019 04:43PM

Photo Stories