Skip to main content

ఒడిశాకు హాకీ ఇండియా విరాళం

ఇటీవల సంభవించిన ఫొని తుఫానుతో అతలాకుతలమైన ఒడిశా రాష్ట్రానికి హాకీ ఇండియా (హెచ్‌ఐ) వినూత్నమైన విరాళాన్ని ప్రకటించింది.
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) పురుషుల సిరీస్ ఫైనల్స్ టోర్నీలో టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఒడిశా ప్రభుత్వానికి విరాళంగా ఇస్తామని ప్రకటించింది. ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ 2019, జూన్ 6 నుంచి 15 వరకు భువనేశ్వర్‌లోనే జరుగనుంది. ప్రస్తుతం హెచ్‌ఐ అధ్యక్షుడిగా మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ఉన్నారు.
Published date : 31 May 2019 05:07PM

Photo Stories