Skip to main content

ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ఈయూ సాయం

Current Affairsఅంఫన్ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదుకొనేందుకు యూరోపియన్ యూనియన్(ఈయూ) భారత్‌కు 5 లక్షల యూరోల సాయం ప్రకటించింది. తుఫానుతో పాటు కరోనాతో పోరాడుతున్న వైద్యరక్షణ కోసం తక్షణ సాయంగా 5 లక్షల కోట్లు యూరోలు అందిస్తున్నట్టు ఈయూ మే 22న తెలిపింది. తొలి విడతగా ఈ నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొంది. అంఫన్ కారణంగా నష్టపోయిన బంగ్లాదేశ్‌కు కూడా సాయం ఈయూ అందించింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువ నష్టం ఉండటంతో 11 లక్షల యూరోల సాయం ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సాయం
ఎప్పుడు : మే 22
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)
ఎందుకు : అంఫన్ తుఫానుతో పాటు కరోనాతో పోరాడుతున్న వైద్యరక్షణ కోసం తక్షణ సాయంగా
Published date : 25 May 2020 06:14PM

Photo Stories