Skip to main content

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ‘బీజేడీ’ ఘనవిజయం

భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) హవా సాగుతోంది.
అసెంబ్లీలోని 147 స్థానాలకు గాను ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న 146 స్థానాల్లో 105 చోట్ల బీజేడీ ఆధిక్యం కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 74 స్థానాలు అవసరం కాగా తిరుగులేని ఆధిక్యంతో ఉన్న బీజేడీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. బీజేడీకి గట్టి పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ 26 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 14, సీపీఎం 1 స్థానంలోనూ ఆధిక్యంతో ఉన్నాయి. బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోటీ చేసిన బిజేపూర్, హింజిలి అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. గత 19 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఓటమి ఎరుగని నేత..
మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ తదనంతరం నవీన్ పట్నాయక్ సారథ్యంలో బిజూ జనతా దళ్ ఏర్పాటైంది. రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో బీజేడీ 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది. బీజేపీతో కలిసి నవీన్ పట్నాయక్ సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు ఓటమి ఎరుగరు. 2004 ఎన్నికల్లో 61, 2009 ఎన్నికల్లో 103 స్థానాలు, 2014 ఎన్నికల్లో 117 స్థానాలు సాధించింది. ఈసారి ఎన్నికల్లో కూడా మరోసారి ఘన విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

ఒడిశా లోక్‌సభ సీట్లు :

పార్టీ

2014

2019

బీజేడీ

20

13

బీజేపీ

01

8

కాంగ్రెస్

00

0


క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) ఘనవిజయం
ఎప్పుడు: మే 23
ఎవరు: నవీన్ పట్నాయక్
ఎక్కడ: ఒడిశా
Published date : 24 May 2019 06:43PM

Photo Stories