నేపాల్ కొత్త మ్యాప్పై నిర్ణయం వాయిదా
Sakshi Education
లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర తమ దేశంలో భాగమేనని చూపుతూ అధికారికంగా దేశ చిత్రపటాన్ని మార్చేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుతానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టకూడదని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతిపాదిత బిల్లు మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం అవసరమని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భావించడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అన్ని పార్టీలు మద్దతిచ్చిన తరువాతనే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.
లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్లో అంతర్భాగమేనని చూపుతూ మే 18వ తేదీన నేపాల్ కొత్త పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమంగా దేశ భూభాగాన్ని పెంచుకునే దుశ్చర్యలకు పాల్పడవద్దని ఘాటుగా నేపాల్ను హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేపాల్ కొత్త మ్యాప్పై నిర్ణయం వాయిదా
ఎప్పుడు: మే 27
ఎవరు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
ఎందుకు: నూతన మ్యాప్ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం అవసరమని
లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్లో అంతర్భాగమేనని చూపుతూ మే 18వ తేదీన నేపాల్ కొత్త పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమంగా దేశ భూభాగాన్ని పెంచుకునే దుశ్చర్యలకు పాల్పడవద్దని ఘాటుగా నేపాల్ను హెచ్చరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నేపాల్ కొత్త మ్యాప్పై నిర్ణయం వాయిదా
ఎప్పుడు: మే 27
ఎవరు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి
ఎందుకు: నూతన మ్యాప్ విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం అవసరమని
Published date : 28 May 2020 05:36PM