Skip to main content

నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో బుహారీ గెలుపు

నైజీరియా అధ్యక్ష పదవికి 2019 ఫిబ్రవరి 23న జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీసీ (ఆల్ ప్రొగ్రెసివ్ కాంగ్రెస్) పార్టీ నేత మహ్మద్ బుహారీ గెలుపొందారు.
ఈ మేరకు మే 29న నైజీరియా ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో బుహారీకి 1,51,91,847 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి, పీడీపీ ( పీపుల్స్ డెమోక్రసీ పార్టీ ) నేత అటీకు అబూబకర్‌కు 1,12,62,978 ఓట్లు వచ్చాయి. 2019, జూన్ 12న దేశాధ్యక్షుడిగా బుహారీ రెండోసారి ప్రమాణం చేయనున్నారు. గతంలో నైజీరియా ఆర్మీ జనరల్‌గా పనిచేసిన బుహారీకి ప్రజాసమస్యలపై పూర్తి అవగాహన ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు
ఎప్పుడు : మే 29
ఎవరు : మహ్మద్ బుహారీ
Published date : 30 May 2019 05:45PM

Photo Stories