నాబార్డ్ చైర్మన్గా గోవింద రాజులు నియామకం
Sakshi Education
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్గా గుంటూరు జిల్లా వాసి చింతల గోవింద రాజులు నియమితులయ్యారు.

ఈ మేరకు ఆయన నియామకానికి కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ మే 20న ఆమోదముద్ర వేసింది. గోవింద రాజులు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి 2022 జులై 31న పదవీ విరమణ చేసే వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు నాబార్డు సీజీఎంగా ఉన్న పీవీఎస్ సూర్యకుమార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు సమీపంలోని బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన గోవింద రాజులు ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో సీడ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. 1985లో నాబార్డులో నేరుగా గ్రేడ్ బీ అధికారిగా క్యాంపస్ రిక్రూట్ అయ్యారు. 35 ఏళ్లుగా నాబార్డ్లో వివిధ హోదాలలో పని చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్గా నియామకం
ఎప్పుడు : మే 19
ఎవరు : చింతల గోవింద రాజులు
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్గా నియామకం
ఎప్పుడు : మే 19
ఎవరు : చింతల గోవింద రాజులు
Published date : 20 May 2020 04:29PM